by సూర్య | Mon, Jan 17, 2022, 02:06 PM
పెళ్లైన తర్వాత తొలి సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చిన అల్లుడికి..365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చి అదరగొట్టారు.....పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వాసి. నాగేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోద సాయికి... ఇటీవల కృష్ణా జిల్లా లక్ష్మీపురానికి చెందిన వినయ్ కుమార్ కు వివాహమైంది. ఇరువురూ......... హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడు వినయ్ కుమార్ ను సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు. కనుమ పురస్కరించుకుని అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. వీటిలో 40రకాలు మాంసాహార కూరలు, 140 రకాల పిండివంటలు, పండ్లు, ఐస్ క్రీం, డ్రింక్ లు, వివిధ రకాల స్నాక్స్ తో భోజనం వడ్డించారు.
Latest News