by సూర్య | Mon, Jan 17, 2022, 12:13 PM
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,58,089 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి మరో 385 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులు నిన్నటితో పోల్చితే 5 శాతం తక్కువగా నమోదయ్యాయినట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం 16,54,361 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఈ వేరియంట్ కేసుల సంఖ్య 8,209 కి చేరాయి.
Latest News