అన్నింటికి భిన్నంగా కోనసీమలో ప్రభల తీర్థం ఉత్సవాలు

by సూర్య | Sun, Jan 16, 2022, 08:40 PM

సంక్రాంతి పండగ వస్తే అన్ని చోట్ల వివిధ రకాలుగా ఉత్సవాలు జరుగుతాయి. కానీ కొనసీమ ఉత్సవాల తీరే వేరు. సంక్రాంతి పండుగ అనగానే గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే అందరికి గుర్తొస్తాయ్. కానీ తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ప్రభల తీర్థం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ప్రభలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. కనుమ పండుగ రోజున కోనసీమలో అన్ని చోట్ల ప్రభల ఉత్సవాలు జరుగుతాయి. కానీ కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థం ఉత్సవాలు ఎంతో ఫేమస్. రుద్ర రూపాలతో ఈ ప్రభలను తయారు చేస్తారు. తాటిదూలాలు, టేకు చెక్కలు, వెదురుబొంగులు చేర్చి వీటిని గోపురం ఆకారంలో నిర్మిస్తారు. నూతనవస్త్రాలు, పూలదండలు, వరికంకులు, నెమలి పించాలతో ఈ ప్రభలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మధ్యలో రుద్రరూపాలతో కూడిన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. గ్రామంలో పలు వీధుల నుంచి ప్రభలను ఊరేగిస్తూ.. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ కాలేజీ ఆవరణకు తీసుకు వస్తారు. అనంతరం భారీ ఎత్తున బాణాసంచా కాల్చి, రికార్డింగ్ డాన్సులు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వీటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలి వస్తుంటారు.

Latest News

 
నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. ఆ స్థానాల్లో టీడీపీకి తప్పని తలనొప్పి Mon, Apr 29, 2024, 07:31 PM
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి షాక్.. జనసేన గుర్తుతో కొత్త తలనొప్పి Mon, Apr 29, 2024, 07:27 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM