గోల్డ్ లోన్ ఏ బ్యాంక్ లో శ్రేయస్కరం

by సూర్య | Sun, Jan 16, 2022, 08:33 PM

బంగారు మీ భవితకు బాటలు వేస్తుంది. డబ్బు లేని సమయంలో ఆసరాగా నిలుస్తుంది. బంగారం పెట్టుబడులకు సురక్షితమైన సాధనం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆర్థిక అవసరాలకు బంగారం ఆపన్నహస్తంగా మారుతోంది. విద్యకు, వైద్యకు, పెళ్లిళ్లకు లేదా ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలకు చాలా మంది బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తీసుకుంటూ ఉంటారు. తక్షణ నగదు అవసరాలకు గోల్డ్ లోన్ ఉత్తమమైన సాధనంగా నిలుస్తోంది. తక్కువ రిస్క్ కారణంతో, ఇతర లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లు తేలికగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ లోన్లు పూర్తిగా కాగిత రహితం. సాధారణంగా అన్ని బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు గోల్డ్ లోన్లను ఇస్తూ ఉంటాయి. బంగారంలో 75 శాతం వరకు మనం లోన్‌ను పొందవచ్చు. బంగారం స్వచ్ఛత, ఇతర అంశాల ఆధారంగా మీ గోల్డ్‌పై పొందే రుణం ఆధారపడి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ స్కీమ్స్, స్వల్ప వ్యవధి కారణంగా బంగారం రుణాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. బ్యాంకు మార్కెట్ డేటా ప్రకారం, ఫెడరల్ బ్యాంకు అత్యంత చౌకైన గోల్డ్ లోన్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాంకు గోల్డ్ లోన్లపై కేవలం 6.99 శాతం మాత్రమే వడ్డీ రేటును విధిస్తోంది. అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఎస్‌బీఐలో కేవలం 7 శాతానికే బంగారం రుణాలను అందుబాటులో ఉంచుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 7.25 శాతానికి గోల్డ్ లోన్‌ను అందిస్తోంది. కెనరా బ్యాంకు 7.35 శాతానికి, ఇండియన్ బ్యాంకు 8 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 8.40 శాతానికి గోల్డ్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. కర్నాటక బ్యాంకు నుంచి 8.49 శాతానికే గోల్డ్ లోన్‌ను పొందవచ్చు. యూకో బ్యాంకు 8.50 శాతానికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 8.50 శాతానికి బంగారం రుణాలను అందిస్తున్నాయి. దీనిలో రుణ మొత్తం రూ.5 లక్షలుగా, రీపేమెంట్ కాలం రెండేళ్లుగా ఉంటోంది. బ్యాంకు మార్కెట్ ప్రకారం, గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటును, టెన్యూర్‌ను, ఇతర వివరాలను పోల్చిచూసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు ఎంత విధిస్తున్నారు, వడ్డీ చెల్లించకపోతే ఎంత పెనాల్టీ విధిస్తున్నారు? వాల్యుయేషన్ ఫీజు ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. అంతేకాక గోల్డ్ లోన్‌కి దరఖాస్తు చేసుకునే ముందు ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఎంత ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. గోల్డ్ లోన్ టెన్యూర్ 3 నెలల నుంచి గరిష్టంగా 48 నెలల వరకు ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే కాలాన్ని బట్టి వడ్డీ రేటును కాలిక్యులేట్ చేసుకోవాలి.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM