by సూర్య | Sun, Jan 16, 2022, 06:33 PM
ఒక్క తమిళనాడులోనే ఒక్కరోజే 23,989 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 10, 11, 12 తరగతుల విద్యార్థులకు కూడా ఈ నెలాఖరు వరకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 19న జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు విద్యాశాఖ తెలిపింది.
Latest News