యాషెస్ టెస్టు సిరీస్ : ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా గెలుపు

by సూర్య | Sun, Jan 16, 2022, 06:00 PM

యాషెస్ 5 వ టెస్టు సిరీస్ లో  ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. చిరకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న ఈ రెండు జట్లు యాషెస్‌లో విజయం కోసం సర్వశక్తులు ధారపోసి ఆడాయి.  ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య జట్టుదే పైచేయి గా నిలిచింది.  ఈరోజు ముగిసిన చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. యువ బౌలర్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ ఐదో టెస్టులో 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 124 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 3, స్కాట్ బోలాండ్ 3, ప్యాట్ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM