by సూర్య | Sun, Jan 16, 2022, 05:06 PM
న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగమ్మాయి ఎంపిక అయ్యింది. ఇది ఎంతో అరుదైన గౌరవం అని ప్రకాశం జిల్లా టంగటూరుకు చెందిన మేఘన ఆనందం వ్యక్తం చేసారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు దానితో న్యూజిలాండ్ లో యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే…పార్లమెంట్ సభ్యురాలిగా ఈమె వాల్కటో ప్రాంతం నుంచి ఎంపికయ్యారు. తండ్రి గడ్డం రవికుమార్ 2001లోనే న్యూజిలాండ్ కు వెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన…కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో స్టడీ చేశారు. వివిధ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేఘన…అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరించారు. వలస వస్తున్న శరణార్థుల విషయంలో చొరవ తీసుకుంటున్నారు. వారి సమస్యలు..వారికి విద్య, ఆశ్రయం..ఇతర వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మేఘన ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Latest News