పరాయి వ్యక్తి కోసం కట్టుకున్నోడి ప్రేమకు సమాధి!

by సూర్య | Fri, Jan 14, 2022, 12:04 PM

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకు భార్య చేసిన పనికి భర్త ప్రాణాలతో లేకుండా పోయాడు. కట్టుకున్నదే కాలయముడై అత్యంత కిరాతకంగా చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకా మదిక్కెరె గ్రామానికి సమీపంలో జరిగింది. సంతోష్(29) అనే యువకుడు కొడగు జిల్లా సోమవపేటె తాలూకాకు చెందిన సంతోష్ అనే యువకుడు శ్రుతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్లపాటు హాయిగా సాగిన వీరి కాపురం భార్య పక్కచూపులతో బీటలు వారింది. పరాయి వ్యక్తితో శృతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇవేవీ తెలియని సంతోష్ భార్యను మునుపటిలా ప్రేమగా చూసుకుంటూనే ఉన్నాడు. శృతి మాత్రం సంతోష్ అడ్డును తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. తన ప్రియుడితో కలిసి హత్య చేసి రోడ్డుపై శవాన్ని పారేశారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రవర్తన, సంతోష్ శరీరంపై ఉన్న గాయాలతో గట్టిగా ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుందని నమ్మిన సంతోష్ ను పరాయి సుఖం కోసం చంపిన శృతిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

 
100 కుటుంబాలు టీడీపీలో చేరిక Mon, May 06, 2024, 03:31 PM
ధర్మవరంలోని కళాశాల మైదానంలో మృతదేహం Mon, May 06, 2024, 03:26 PM
ప్రజలందరూ కూటమి అభ్యర్థులకు అండగా ఉండాలి: చంద్ర బాబు Mon, May 06, 2024, 03:23 PM
వైసీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: తలారి రంగయ్య Mon, May 06, 2024, 03:20 PM
చక్రాయపేటలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:17 PM