by సూర్య | Fri, Jan 14, 2022, 11:40 AM
దేశంలోని అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక 2021 ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. 647 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఒడిశా 537 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మూడో స్థానం దక్కించుకుంది. గత రెండేళ్లలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. గత రెండేళ్లలో పోలిస్తే ఏపీలో 2.22 శాతం, తెలంగాణలో 3.07 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది.
Latest News