by సూర్య | Fri, Jan 14, 2022, 11:34 AM
ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వర్షం కారణంగా పోటీలను P.V.R పాఠశాల మైదానం నుంచి..... మినీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియాలకు మార్పుచేశారు. చిట్టం ఆంజనేయులు, N. వెంకటేశ్వర్లు మెమోరియల్ పోటీలకు... రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలబాలికలు జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రెండో రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనంతపురం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన జట్లు ఉత్సాహంగా పోటీ పడ్డాయి .
Latest News