by సూర్య | Thu, Jan 13, 2022, 09:48 PM
ఉత్తరప్రదేశ్ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు బిజెపి జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లేదా మధుర నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు వర్చువల్గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి యోగీ అయోధ్య నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. లేని పక్షంలో మధుర నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడుగా ఉన్నారు. 72 గంటల వ్యవధిలో ఇద్దరు మంత్రులు..ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చారు.
Latest News