by సూర్య | Thu, Jan 13, 2022, 09:49 PM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా మెలిగిన పార్టీలు ఇప్పుడు శత్రువులుగా మారుతున్నాయి. బీజేపీ ఓబీసీల శత్రువని ఎస్బీఎస్పీ నేత ఓపీ రాజ్ భర్ అభివర్ణించారు. బీజేపీని ఆ పార్టీకి చెందిన ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేు వీడిపోవనడంపై స్పందిస్తూ రాబోయే రోజుల్లో మరింత మంది ఆ పార్టీని వీడే అవకాశం ఉందన్నారు. గతంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉండి, తాజాగా ఎస్పీతో జట్టు కట్టిన రాజ్ భర్.. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఓబీసీ నేతల్ని తమవైపు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీని వీడిని ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ టీజర్ మాత్రమేనని, కాషాయ పార్టీ ఓబీసీల బలాన్ని కాపాడుకోవడం ఎన్నికల ముందు సవాల్ గా మారనుందని వ్యాఖ్యానించారు.
Latest News