by సూర్య | Thu, Jan 13, 2022, 08:30 PM
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లా లో ఘోరా రైలు ప్రమాదం జరిగింది. గౌహతి-బికనీర్ ఎక్స్ప్రెస్ రైలు న్యూ దమోహని వద్ద పట్టాలు తప్పడంతో ఆరు బోగీలు పక్కకు పడిపోయాయి. మరో ఆరు బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. పడిపోయిన బోగీలో ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
Latest News