బీజేపీ కార్యాలయంలో కరోనా కలకలం

by సూర్య | Wed, Jan 12, 2022, 03:11 PM

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుమారు 50 మంది కరోనా బారిన పడినట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం కానున్నాయి. ఈ రెండు భేటీలకు ప్రధాని మోదీ హాజరుకావాల్సి ఉంది. ముందుజాగ్రత్తగా కార్యాలయ సిబ్బందికి కరోనా ​టెస్టులు చేశారు. ఈ క్రమంలోనే ఆఫీసులో పని చేసే సుమారు 50 మందికిపైగా కరోనా సోకినట్లు తెలింది. ఇప్పటికే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర కార్యాలయం మీడియా ఇంఛార్జి సంజయ్‌ మయూక్‌ కు కూడా కరోనా సోకింది. దీంతో నేతలు హోం క్వారెంటైన్​ కు పరిమితం అయ్యారు. నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ కరోనా బారిన పడటంతో నేతలంతా వర్చువల్‌గా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM