by సూర్య | Wed, Jan 12, 2022, 01:18 PM
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్డిఓ కార్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం స్పెషల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు పేకాట వంటి కార్యకలపాలు నిర్వహించి, మూగజీవాలకు బాధ కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించే నట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేశారు.
ప్రస్తుతం కరోన వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో గుంపులు గుంపులుగా సంచరించ రాదని, ఈ సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించి మూడు అడుగుల దూరం పాటించాలని తెలిపారు.
Latest News