by సూర్య | Wed, Jan 12, 2022, 10:02 AM
పెరిగిన పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కురుపాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధరలు తగ్గాలంటే జగన్ దిగాలంటూ నినాదాలు చేపట్టారు.
Latest News