by సూర్య | Tue, Jan 11, 2022, 04:15 PM
విశాఖలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వేలో గత కొంతకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో సంతోష్ పనిచేస్తున్నాడు. టైడాకు చిమిడిపల్లికి మధ్యలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ అనంతగిరి మండలం పెడబిడ్డ పంచాయితీ చిమిటి గ్రామానికి చెందిన వారని సమాచారం. కాగా టైడాకు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
Latest News