పేద ప్రజల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటం

by సూర్య | Tue, Jan 11, 2022, 01:01 AM

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, తప్పుడు కరోనా పాజిటివ్ లెక్కలు (సంఖ్యలు) చూపించి అనవసరంగా ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తోందని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఆరోపిస్తున్నారు. మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించి మేము నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడానికి బీజేపీ కోవిడ్ పాజిటివ్ కేసుల నాటకాలు ఆడుతోందని డీకే. శివకుమార్ ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే సమయంలో డీకే. శివకుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులకు కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర వార్నింగ్ ఇచ్చారు. హోమ్ మంత్రి వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కర్ణాటక హోమ్ మంత్రి మీద డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర కాదు అజ్ఞాని జ్ఞానేంద్ర అంటూ డీకే శివకుమార్ మండిపడ్డారు. ఇదే సమయంలో హోమ్ మంత్రిని విమర్శించిన డీకే శివకుమార్ బహిరంగ సభలో పదేపదే రేప్ మంత్రి అనే పదం ఉపయోగించడం కలకలం రేపింది. కర్ణాటకలోని బీజేపీ బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, తప్పుడు కరోనా పాజిటివ్ లెక్కలు చూపించి అనవసరంగా ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తోందని, ఈ వివషయంలో న్యాయవిచారణ జరిపించి వాస్తవాలు బయటకు వచ్చేలా చూడాలని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM