by సూర్య | Mon, Jan 10, 2022, 10:43 PM
మున్నేరు ఏటిలో ఈత కొడుతూ ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సంక్రాంతి సెలవులు కావడంతో కలిసి గ్రామానికి కిలోమీటరు దూరంలోని మున్నేరు వద్ద ఈతకు వెళ్లారు. విద్యార్థులు దుస్తులు వదిలేసి నదిలో ఈతకు దిగినట్లు తెలుస్తోంది. వారు వదిలేసిన బట్టల ఆధారంగా, నదిలో దిగిన పిల్లలను ఎక్కడి నుంచి గల్లంతైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరంతా ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు.
Latest News