by సూర్య | Mon, Nov 22, 2021, 12:58 PM
కడప జిల్లాలో వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా పర్యటిస్తున్నారు. కడప నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను మేయర్ సురేష్ బాబుతో కలిసి మంత్రులు పరిశీలించారు. రామకృష్ణానగర్, మోచంపేట, రవీంద్రనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ బాధిత కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.
Latest News