by సూర్య | Sun, Nov 21, 2021, 11:44 AM
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇటీవల శాసనసభలో పలువురు నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన వ్యక్తిగత దూషణలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆయన చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటనలతో మానసికంగా కుంగిపోయిన చంద్రబాబును పరామర్శించారు. అనంతరం ఏపీలో పరిస్థితిని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.
Latest News