by సూర్య | Sun, Nov 21, 2021, 11:38 AM
విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ఎందుకు నిర్వహిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించగా.. టీడీపీ కార్యాలయంలో గంజాయి ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అందుకే సోదాలు నిర్వహిస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News