by సూర్య | Sat, Nov 20, 2021, 11:53 AM
తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు. తిరుపతిలోని పలు కాలనీలు జలదిగ్బంధం. అలిపిరి, శ్రీవారి మెట్టునడక మార్గాలతో పాటు పాపవినాశనం రహదారిని నిలిపివేసిన టీటీడీ. భారీ వర్షాలకు దెబ్బతిన్న నడకదారులు.. వరదలకు శ్రీవారి మెట్టుమార్గం భారీగా ధ్వంసం. 1200 మెట్టు వద్ద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి. శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటికీ కొనసాగుతున్న వరద.నడకమార్గంలో అనేక ప్రాంతాలో ధ్వంసమైన మెట్లు. 500,600,800 మెట్ల వద్ద వరద ప్రవాహానికి కోతకు గురైన మెట్ల మార్గం.మరమత్తు పనులుకు వారంరోజులు సమయం పట్టే అవకాశం. ఇప్పట్లో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి లేనట్లే.
Latest News