by సూర్య | Sat, Nov 20, 2021, 11:39 AM
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మూడు అంతస్తుల పాత భవనం కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. శిధిలాల కింద నుంచి దంపతులకు క్షేమంగా బయటకు తీసిన సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. శిధిలాల కింద మూడు కుటుంబాలకు సంబంధించి తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం. మూడు అంతస్తుల పాత భవనం పక్కనున్న రెండు అంతస్తులు మరో ఇంటిపై పై కుప్పకూలడంతో రెండు అంతస్తులు భవనం తో పాటు మరో ఇల్లు కూలిపోయింది.
సంఘటన జరిగిన వెంటనే ఫైర్ ,పోలీస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ సంఘటనా ప్రదేశానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు జెసిబి సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ నాగేంద్ర సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాత భవనం గోడలు మెత్తబడి పక్కనున్న భవనంపై కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.శిధిలాలను పూర్తిస్థాయిలో తొలగిస్తే ప్రాణ నష్టం అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Latest News