by సూర్య | Thu, Nov 18, 2021, 10:28 PM
ఏపీ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మైతా గ్రామంలో మావోయిస్టులు ప్రజాకోర్టును నిర్వహించి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆదివాసీని హతమార్చిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం చెరువుగుంపు గ్రామానికి చెందిన మద్వి రాజ్కుమార్ను భద్రాచలం సమీపంలోని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆదివాసీ పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని మావోయిస్టులు ఆరోపించారు.