by సూర్య | Wed, Oct 27, 2021, 11:19 AM
బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు . 'నేను ఉన్నాను అంటూ ఊరూరా తిరిగి మైకులు పట్టుకొని ఊదరగొట్టిన వైఎస్ జగన్ గారు, 2 సంవత్సరాల కాలంలో బద్వేలు ప్రజలకు ఇస్తామని చెప్పిన తాగునీరు, సాగునీరు ఇచ్చారా?' అని ఆయన ప్రశ్నించారు.'బద్వేలు ప్రజలారా ఆలోచించుకోండి. ఒక్కసారి కమలం గుర్తుకు ఓటు వేయండి. మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోండి' అని సోము వీర్రాజు సూచించారు. అప్పట్లో జగన్ కురిపించిన హామీలు, ఇప్పుడు ఆయన మాట్లాడుతోన్న తీరులను వివరిస్తూ సోము వీర్రాజు ఓ వీడియో పోస్ట్ చేశారు.
Latest News