by సూర్య | Wed, Oct 27, 2021, 11:27 AM
ఏపీలో మాదకద్రవ్యాల హబ్గా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ''గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి'' అని పవన్ అన్నారు.
Latest News