by సూర్య | Wed, Oct 27, 2021, 09:31 AM
లాస్ఏంజెల్స్ : అమెరికా రాష్ట్రమైన ఇదహౌలో షాపింగ్ మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పోలీసు అధికారితో సహా నలుగురు గాయపడ్డారు. మాల్లో కాల్పులు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు వెళ్ళారని నగర పోలీసు చీఫ్ రియాన్ లీ విలేకర్లకు తెలిపారు. దుండగుడితో పరస్పరం కాల్పులు జరిగాయని, ఒక పోలీసు అధికారి గాయపడ్డారని చెప్పారు. అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. కాల్పులు జరిగిన బోయిస్ టౌన్ స్క్వేర్ మాల్లో 150కి పైగా అంతస్తులు, రెస్టారెంట్లు వున్నాయి.
Latest News