రాకెట్ లాంచర్లతో దాడులు..11 మంది దుర్మరణం
by సూర్య |
Wed, Oct 27, 2021, 07:58 AM
పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతంలో అటవీ భూమి విషయంలో రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 11 మంది మరణించారు. 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ఈ సంఘటన పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతం ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో జరిగింది. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని పెషావర్ కు 251 కిలోమీటర్ల దూరంలో ఖుర్రం జిల్లాలోని తేరి మెగల్ గ్రామంలో నివసిస్తున్న గైడు తెగ ప్రజలు గ్రామంలో కట్టెలు కొడుతున్న పెవార్ వంశ సభ్యులపై దాడి చేయడంతో ఘర్షణ ప్రారంభమైంది.
Latest News