ఇంట్లో పేలిన రిఫ్రిజిరేటర్.. దంపతులు సజీవదహనం..!

by సూర్య | Tue, Oct 26, 2021, 02:52 PM

ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో దంపతులు సజీవదహనమయ్యారు. అయితే వారి తొమ్మిదేండ్ల కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని కేందుఝార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ, పూర్ణచంద్ర దెహూరీగలు భార్య భర్తలు. వారు తమ తొమ్మిదేండ్ల కొడుకు బరుణ్ తో ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు రిఫ్రిజిరేటర్ పేలింది. దాంతో వెంటనే మంటలు వ్యాపించాయి.


ఇది గమనించిన బాలుడు బరుణ్ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. బంధువుల ఇంట్లో పడుకోవడానికి వెళ్లిన తన సోదరుడిని పిలిచేందుకు వెళ్లాడు. అలాగే స్థానికులను విషయం చెప్పగా వారు ఇంట్లోని దంపతులను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ దంపతులు మంటల్లో కాలిపోయి సజీవదహనమయ్యారు.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM