by సూర్య | Tue, Oct 26, 2021, 11:37 AM
బీజాపురం జిల్లా సింధిగి లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారా నికి వెళ్లి తిరిగి బెంగళూరుకు వెళ్లుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య హెలిక్యాప్టర్ సాంకేతిక లోపం కారణంగా బళ్లారి ఎయిర్పోర్టులో టెక్నికల్ హల్టు తీసుకుంది. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సిద్దరామయ్య బీజాపురం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం ముగించుకుని కాంగ్రెస్ నాయకులు జమీర్ అహమ్మద్, రేవన్న బెంగళూరుకు తిరిగి వెళుతున్నారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ను సాంకేతిక లోపం కారణంగా బళ్లారి హెలీప్యాడ్లో లాండ్ చేశారు. మాజీ సీఎంను బళ్లారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కాంతీనోహ విల్సన్, తాయప్ప, ఇతర కాంగ్రెస్ నాయకులు కలిశారు.
Latest News