దేశంలో కొత్తగా 12,428 పాజిటివ్ కేసులు
by సూర్య |
Tue, Oct 26, 2021, 10:41 AM
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,428 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 356 మంది కరోనా వల్ల మరణించారు. కరోనా నుంచి తాజాగా 15,951 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క కేరళలోనే నిన్న 6,664 కరోనా కేసులు నమోదు కాగా 53 మంది మరణించారు.
Latest News