by సూర్య | Tue, Oct 26, 2021, 10:33 AM
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నా శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు వెంకటాపురం వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర ముందు వెళుతున్న ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మెదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు.
Latest News