by సూర్య | Tue, Oct 26, 2021, 09:45 AM
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఓడిపోవడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొడగు జిల్లా సోమవారపేట తాలూకా దొడ్డబళె గ్రామానికి ఉదయ్ (50) క్రికెట్ అభిమాని. అతడు ఆదివారం రాత్రి భారత్, పాక్ మ్యాచ్ చూస్తుండగా భారత్ ఓటమి అంచున ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
Latest News