by సూర్య | Tue, Oct 26, 2021, 08:09 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఈరోజు మరో రెండు జట్లు వచ్చి చేరాయి. దుబాయ్లో రెండు కొత్త ఐపీఎల్ జట్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఈ మేరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన బీసీసీఐ రెండు టీంలను ప్రకటించింది. ఇందులో అహ్మాదాబాద్, లక్నో నగరాల నుంచి రెండు టీంలు ఐపీఎల్లో చేరనున్నట్లు ప్రకటించింది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని RPSG గ్రూప్ లక్నో టీంను గెలుచుకుంది. దీనికోసం రూ. 7000 కోట్లకు బిడ్ను వేసి గెలుచుకుంది. అలాగే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC అహ్మదాబాద్ టీంను గెలుచుకుంది. అహ్మదాబాద్ టీమ్ను రూ.5,600 కోట్లకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC సంస్థ దక్కించుకుంది. దీంతో బీసీసీఐకి రూ.12,690 కోట్ల ఆదాయం రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సమూహాలలో అదానీ గ్రూప్ కూడా బిడ్ దాఖలు చేసింది. కానీ, అదానీ గ్రూపు మాత్రం బిడ్లో గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కొత్త టీమ్లు ఏవన్న దానిపైనే అందరి దృష్టి నిలిచింది. బిడ్లను కాచి వడపోసిన అనంతరం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది.
Latest News