ఐపీఎల్‌ 2022లో కొత్తగా చేరే టీంలు ఇవే

by సూర్య | Tue, Oct 26, 2021, 08:09 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఈరోజు మరో రెండు జట్లు వచ్చి చేరాయి. దుబాయ్‌లో రెండు కొత్త ఐపీఎల్ జట్ల కోసం బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ మేరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన బీసీసీఐ రెండు టీంలను ప్రకటించింది. ఇందులో అహ్మాదాబాద్, లక్నో నగరాల నుంచి రెండు టీంలు ఐపీఎల్‌లో చేరనున్నట్లు ప్రకటించింది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని RPSG గ్రూప్ లక్నో టీంను గెలుచుకుంది. దీనికోసం రూ. 7000 కోట్లకు బిడ్‌ను వేసి గెలుచుకుంది. అలాగే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC అహ్మదాబాద్ టీంను గెలుచుకుంది. అహ్మదాబాద్‌ టీమ్‌‌ను రూ.5,600 కోట్లకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC సంస్థ దక్కించుకుంది. దీంతో బీసీసీఐకి రూ.12,690 కోట్ల ఆదాయం రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సమూహాలలో అదానీ గ్రూప్ కూడా బిడ్‌ దాఖలు చేసింది. కానీ, అదానీ గ్రూపు మాత్రం బిడ్‌లో గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కొత్త టీమ్‌లు ఏవన్న దానిపైనే అందరి దృష్టి నిలిచింది. బిడ్లను కాచి వడపోసిన అనంతరం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM