శశికళ రీ ఎంట్రీపై అధిష్ఠానందే నిర్ణయం: పన్నీర్ సెల్వం

by సూర్య | Mon, Oct 25, 2021, 06:54 PM

ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రీ ఎంట్రీపై.. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తిరిగి ఏఐఏడీఎంకేలో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు, వెళ్లిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.


ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఇటీవల తన పేరుతో ఒక ఫలకాన్ని తయారు చేయించారు. ఆ ఫలకాన్ని పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీ రామంచంద్రన్ మెమోరియల్ వద్ద ఆవిష్కరించారు. ఆ ఫలకంపై శశికళ ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ అని రాయించుకున్నారు. దీనిపై అన్నాడీఎంకే గత వారం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో శశికళ అన్నాడీఎంకేలో చేరుతున్నారా..? అన్నా మీడియా ప్రశ్నకు పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM