by సూర్య | Mon, Oct 25, 2021, 06:54 PM
ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రీ ఎంట్రీపై.. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తిరిగి ఏఐఏడీఎంకేలో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు, వెళ్లిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఇటీవల తన పేరుతో ఒక ఫలకాన్ని తయారు చేయించారు. ఆ ఫలకాన్ని పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీ రామంచంద్రన్ మెమోరియల్ వద్ద ఆవిష్కరించారు. ఆ ఫలకంపై శశికళ ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ అని రాయించుకున్నారు. దీనిపై అన్నాడీఎంకే గత వారం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో శశికళ అన్నాడీఎంకేలో చేరుతున్నారా..? అన్నా మీడియా ప్రశ్నకు పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.
Latest News