మన సినిమాలు మనదేశపు సాంస్కృతిక విలువలను మోస్తుంటాయి: వెంకయ్యనాయుడు

by సూర్య | Mon, Oct 25, 2021, 05:44 PM

డీల్లీలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలు మనదేశపు సాంస్కృతిక ఎగుమతుల్లో అగ్రగాములు అని అభివర్ణించారు.  ప్రపంచ భారతీయ సమాజాన్ని తిరిగి స్వదేశానికి అనుసంధానించడంలో కీలకపాత్ర సినిమాలదేనని పేర్కొన్నారు.


"భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు కీలక సందేశాన్ని అందిస్తుంటాయి. అందుకే మన సినిమాలు భారతీయతను లేక హిందూస్థానిజంను ప్రతిబింబించేలా ఉండాలి. సాంస్కృతిక దౌత్యంలో ముందువరుసలో నిలిచే రాయబారుల వంటి పాత్రను మన సినిమాలు పోషించాలి. సందేశంతో కూడిన చిత్రాలకు శాశ్వత ఆదరణ ఉంటుందని మనందరకి తెలుసు" అని పేర్కొన్నారు. 

Latest News

 
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM
శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 11:55 AM