by సూర్య | Sun, Oct 24, 2021, 11:49 AM
భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ప్రపంచ కప్ల్లో టీమిండియాకు.. పాకిస్థాన్పై తిరుగులేని రికార్డు ఉంది. అదే సెంటిమెంట్తో మరోసారి సత్తాచూపాలని చూస్తోంది కోహ్లీసేన. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే.. భావోద్వేగాలు. రెండు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. కశ్మీర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. అసలు ఈ మ్యాచ్ నిర్వహించకూడదని కొందరు ప్రచారం చేశారు. చివరికి ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్ ఆడకుండా తప్పుకోవడం కరెక్ట్ కాదని.. బీసీసీఐ స్పష్టంచేయడంతో.. మ్యాచ్కు లైన్ క్లియరైంది. ఇటు, ఈ మ్యాచ్ కోసం జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి.
Latest News