బీజేపీని ఓడించేందుకు పార్టీలన్నీ ఏకం కావాలి : మమతా బెనర్జీ

by సూర్య | Sat, Oct 23, 2021, 01:39 PM

గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలవనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి 28వ తేదీన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ తన ట్విట్టర్‌లో ఓ విషయాన్ని పోస్టు చేసింది. భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ విభజన రాజకీయాలను ఓడించేందుకు వ్యక్తులు, సంస్థలు, రాజకీయా పార్టీలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. గోవా ప్రజలు గత పదేళ్ల నుంచి ఎంతో వేదనకు గురైనట్లు ఆమె తన ట్వీట్‌లో తెలిపారు. గోవాకు 28వ తేదీన వెళ్తున్నాని, అందరూ ఏకమై బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ కోరారు. కలిసికట్టుగా గోవాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రజల ఆశయాలను నిజం చేద్దామని దీదీ తన ట్వీట్‌లో తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM