by సూర్య | Sat, Oct 23, 2021, 11:34 AM
రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పరిశీలన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) శనివారం సమావేశం కానుంది. ఈ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరగనుంది. 150 అసెంబ్లీ స్థానాలను సరైన అభ్యర్థులను కాంగ్రెస్ పరిశీలించనుంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయిల్లో సన్నాహకాలను పార్టీ ప్రారంభించింది. 'శిక్షణ నుండి పరాక్రమం వరకు' అనే నినాదంలో కార్యకర్తలకు శిక్షణిస్తోంది.
ఇప్పటికే రెండు స్థాయిల్లో ఈ శిక్షణ పూర్తైనట్లు సమాచారం. కాగా, వచ్చేవారంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ఆఫీస్ బేరర్స్తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. కాగా, ఆమె శనివారం రాష్ట్రంలో మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో 40 శాతం స్థానాలను మహిళలకే కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి విదితమే. అదేవిధంగా 12వ తరగతి విద్యార్ధినులకు స్మార్ట్ఫోన్లు, డిగ్రీ చదువుతున్న విద్యార్ధినులకు ఎలక్ట్రానిక్ స్కూటర్లను ఇస్తామని హామీలను గుప్పించారు. కాగా, మరిన్ని తాయిలాలను కూడా శనివారం ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Latest News