by సూర్య | Sat, Oct 23, 2021, 07:56 AM
ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కల్యాణ దుర్గంలో మల్లికార్జున అనే వ్యక్తి తన 2 నెలల పాపను దారుణంగా చంపేశాడు. బిడ్డ తన పోలికలతో పుట్టలేదని అతడు తన భార్యతో గొడవపెట్టుకున్నాడు. గురువారం రాత్రి పాపను బయటకు తీసుకువెళ్లాడు. పాపను చంపేస్తాడనే భయంతో పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాప ఆచూకీ కోసం పోలీసులు రాత్రి నుంచి గాలించారు. ఇవాళ పాప ఓ సంచిలో నిర్జీవంగా కనిపించింది. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి తండ్రి మల్లికార్జున పాపను హత్యచేశాడు.
Latest News