ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

by సూర్య | Sat, Oct 23, 2021, 07:46 AM

ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.పోలీసుల కథనం మేరకు పులిచెర్ల మండలం ఎర్రపాపిరెడ్డిగారి పల్లెకు చెందిన నూర్ అలీ ( 55 ), కల్లూరు బీసీ కాలనీకి చెందిన బావాజీ ( 35 ) కూలి పనులు చేసు కొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ద్విచక్ర వాహనంలో ఎర్రపాపి రెడ్డిగారి పల్లె నుంచి పీలేరుకు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. వడ్లపల్లెకు సమీపంలో పులిచెర్ల నుంచి పీలేరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. ఇద్దరి తలలకూ బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నూర్ అలీ తండ్రి నన్నేసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నూర్ అలీ, బావాజీ మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Latest News

 
రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా? Fri, Apr 19, 2024, 12:24 PM
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్‌కు ఏం చేసారు? Fri, Apr 19, 2024, 12:23 PM
అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపించాం Fri, Apr 19, 2024, 12:23 PM
ప్రభంజనంలా వైయస్ఆర్‌సీపీ విజయం సాధించబోతోంది Fri, Apr 19, 2024, 12:22 PM
నామినేషన్ వేసిన మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:17 PM