by సూర్య | Sat, Oct 23, 2021, 07:46 AM
ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.పోలీసుల కథనం మేరకు పులిచెర్ల మండలం ఎర్రపాపిరెడ్డిగారి పల్లెకు చెందిన నూర్ అలీ ( 55 ), కల్లూరు బీసీ కాలనీకి చెందిన బావాజీ ( 35 ) కూలి పనులు చేసు కొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ద్విచక్ర వాహనంలో ఎర్రపాపి రెడ్డిగారి పల్లె నుంచి పీలేరుకు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. వడ్లపల్లెకు సమీపంలో పులిచెర్ల నుంచి పీలేరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. ఇద్దరి తలలకూ బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నూర్ అలీ తండ్రి నన్నేసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నూర్ అలీ, బావాజీ మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Latest News