క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్
by సూర్య |
Sat, Oct 23, 2021, 07:33 AM
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. కోవిడ్ కారణంగా రద్దైన మ్యాచ్ మళ్లీ జరగబోతుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్కు డేట్ ఖరారు అయింది. ఈ టెస్ట్ను జూలై 2022లో నిర్వహించనున్నారు. దీనిపై ఇరు బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇంగ్లాండ్ జరిగిన టెస్ట్ సిరీస్లో భారత శిబిరంలో కోవిడ్ కేసుల కారణంగా ఐదో టెస్ట్ రద్దైంది. అయితే ఈ టెస్ట్ నిర్వహణపై ఇరు దేశాల బోర్టుల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే ఏడాది జూలైలో భారత్ - ఇంగ్లాండ్ మధ్య టీ-20, వన్డే సిరీస్ జరగనుంది.
Latest News