చితకబాదిన టీచర్.. బాలుడు మృతి

by సూర్య | Fri, Oct 22, 2021, 07:34 PM

ఏడో తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలుడిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. హోం వర్క్ చేయలేదన్న కారణంగా చితకబాదాడు. ఆ దెబ్బలు తాళలేక ఆ పిల్లాడు చనిపోయాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోలసర్ అనే గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌ లో గణేష్ అనే స్టూడెంట్ ను మనోజ్ కుమార్ అనే టీచర్ చావబాదాడు. టీచర్ కొట్టిన దెబ్బలకు బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రైవేట్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. సదరు టీచర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. పోలీసులు ఆ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు. గణేష్ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM