by సూర్య | Sat, Jun 12, 2021, 11:46 AM
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి ఆమోదం పొందిన తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్ డేటాను జూన్ 20న విడుదల చేయనున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. జులై నాటికి ప్రజలకు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ పేర్కొన్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కోవాగ్జిన్ మూడవ దశ డేటా, ఫాలో అప్ అధ్యయనాలు మరికొన్ని రోజుల్లోనే అందుబాటులో ఉంచుతామని వికెపాల్ తెలిపారు. డేటా కేంద్రానికి అందించిన తర్వాత...పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే యోచనలో భారత్ బయోటెక్ ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ డేటాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు (సిడిఎస్సిఒ) అందించనుంది. ఆ తర్వాత సమీక్ష నిమిత్తం జర్నల్స్లో ప్రచురితం చేస్తారు.
Latest News