by సూర్య | Sat, Jun 12, 2021, 12:07 PM
బెజవాడలో రియల్ మాఫియా కలకలం రేపుతోంది. రియల్ ఎస్టేట్ పేరుతో కోట్ల రూపాయలకు టోకరా వేశాడో వ్యక్తి. పట్నాల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎంకే డేవలపర్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. బెజవాడలో ఏజెంట్స్తో 6 కోట్ల మేర వసూలు చేశాడు. కస్టమర్ల వద్ద డబ్బులు వసూలు చేసి ఆపై బోర్డు తిప్పేశాడు. దాదాపు వంద మంది వరకు బాధితులు ఉన్నారు. పట్నాల శ్రీనివాసరావుపై గతంలో రాజమండ్రి, వైజాగ్లో చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News