by సూర్య | Sat, Jun 12, 2021, 10:10 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారం 11,210 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 19 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 5002 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Latest News