జగన్‌కు రఘురామ మరో లేఖ

by సూర్య | Sat, Jun 12, 2021, 09:55 AM

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెలబెట్టుకోవాలని రెండు రోజులుగా ఏపీ సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామ.. ఇవాళ కూడా మరో లేఖ రాశారు. పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలను అందులో ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక సాయం పెంచుతామని వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని ప్రకటించినట్లు లేఖలో పేర్కొన్నారు. పెళ్లికానుక ఆర్థిక పెంపుపై ప్రజల నుంచి మద్దతు లభించిందని.. ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంపీ కోరారు. ఏపీలో సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని కోరుతూ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ రెండు లేఖలు రాసిన విషయం తెలిసిందే.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM