by సూర్య | Tue, Jun 08, 2021, 12:01 PM
కర్ణాటక రాష్ట్ర మైసూరు జిల్లా ప్రజలు నన్ను తమ ఇంటి బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్లు ఉంది, ప్రజలకు చాలా ధన్యవాదాలు అని అని బదిలీ అయిన కలెక్టర్ రోహిణి సింధూరి అన్నారు.సోమవారం మైసూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మైసూరు గురించి అన్ని విషయాలను కొత్త కలెక్టర్కు వివరించానని తెలిపారు. తాను ఇలాంటి సమయంలో బదిలీ అవుతానని అనుకోలేదన్నారు. కలెక్టర్ రోహిణి సింధూరికి, మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ల మధ్య సీఎస్ఆర్ నిధుల విషయంలో రగడ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై శిల్పానాగ్ ఇలాంటి పరిస్థితిల్లో ఉద్యోగం చేయలేనని, రోహిణి సింధూరి ఆధీపత్య ధోరణిపై ఆరోపణలు చేసింది. అయితే, ఈ కలెక్టర్ల రచ్చ.. పెద్ద సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన బెంగళురు సీఎం యడియురప్ప ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్గా ఇది వరకే బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీని రద్దు చేయాలని రోహిణి సింధూరి, సీఎం యడియురప్పను కోరగా సాధ్యంకాదని చెప్పినట్లు తెలిసింది.
Latest News