కలెక్టర్‌ రోహిణి సింధూరి ఎమోషనల్​ కామెంట్స్

by సూర్య | Tue, Jun 08, 2021, 12:01 PM

కర్ణాటక రాష్ట్ర  మైసూరు జిల్లా ప్రజలు నన్ను తమ ఇంటి బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్లు ఉంది, ప్రజలకు చాలా ధన్యవాదాలు అని అని బదిలీ అయిన కలెక్టర్‌ రోహిణి సింధూరి అన్నారు.సోమవారం మైసూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మైసూరు గురించి అన్ని విషయాలను కొత్త కలెక్టర్‌కు వివరించానని తెలిపారు. తాను ఇలాంటి సమయంలో బదిలీ అవుతానని అనుకోలేదన్నారు. కలెక్టర్​ రోహిణి సింధూరికి, మైసూరు పాలికె కమిషనర్​ శిల్పానాగ్​ల మధ్య సీఎస్​ఆర్​ నిధుల విషయంలో రగడ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై శిల్పానాగ్ ఇలాంటి పరిస్థితిల్లో ఉద్యోగం చేయలేనని, రోహిణి సింధూరి ఆధీపత్య ధోరణిపై ఆరోపణలు చేసింది. అయితే, ఈ కలెక్టర్ల రచ్చ.. పెద్ద సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన బెంగళురు సీఎం యడియురప్ప ఇద్దరు కలెక్టర్​లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్​గా ఇది వరకే బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీని రద్దు చేయాలని రోహిణి సింధూరి, సీఎం యడియురప్పను కోరగా సాధ్యంకాదని చెప్పినట్లు తెలిసింది.

Latest News

 
కొరిశపాడు, రేణింగివరం రహదారిపై రోడ్డు ప్రమాదం Thu, May 02, 2024, 04:09 PM
విద్యారంగాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులు Thu, May 02, 2024, 04:07 PM
మృతుడికి నివాళులార్పించిన ఎమ్మెల్యే Thu, May 02, 2024, 04:02 PM
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి Thu, May 02, 2024, 03:57 PM
ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన బి. కె. పార్థసారథి Thu, May 02, 2024, 03:55 PM