by సూర్య | Tue, Jun 08, 2021, 12:23 PM
ఓ వ్యాపారి పాలను రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. చిత్తూరు జిల్లాలో సొరకాయల పేటలో పాలకేంద్రంపై ఆహార భద్రత అధికారి ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. నూనె, యూరియా, సల్ఫర్ వంటి రసాయనాలతో పాలను తయారు చేస్తున్నారని నిర్ధారించారు. 40 లీటర్ల కల్తీ పాలతోపాటు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పాల కేంద్రం నిర్వహిస్తున్న సంజీవరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Latest News